కోవిడ్ పరిహారం కోసం ఆన్లైన్ పోర్టల్
- December 19, 2021
ఏపీ: కోవిడ్తో అనాధలైన కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం కృష చేస్తుంది.ఇప్పటికే వారికి సాయం ప్రకటించింది. అయితే ఆ సాయం నేరుగా వారికే చేరేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ప్రక్రియను ఇక ఆన్లైన్ చేసేందుకు కోవిడ్ 19 పోర్టల్ను తీసుకొచ్చింది.కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా మరణించిన వారి వారసులకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించడానికి ఆన్లైన్ పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి ఈ మేరకు నోటిఫికేషన్ను జారీ చేశారు. బాధిత కుటుంబాలకు త్వరగా,సులభంగా నష్టపరిహారం అందజేసేందుకు కేంద్ర,రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలు సమన్వయంతో వ్యవహరించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
మొబైల్తోపాటు కంప్యూటర్లోనూ ఆన్లైన్ పోర్టల్లో నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. బాధితులు http://covid19.ap.gov.in/exgratia పోర్టల్లో నష్టరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం బాధితులు మృతుడికి కోవిడ్ నిర్థారించిన ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ లేదా మాలిక్యులర్ టెస్ట్ రిపోర్టులలో ఏదో ఒక డాక్యుమెంట్ను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









