ఆర్థిక సహాయక చర్యలు మరో ఆరు నెలలు పొడగింపు
- December 19, 2021
యూఏఈ: కొత్త రుణాలు, ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునేందుకు కరోనా మహమ్మారి సమయంలో ప్రకటించిన ఉద్దీపన చర్యలను యూఏఈ సెంట్రల్ బ్యాంక్ మరో ఆరు నెలల పాటు పొడిగించింది. టార్గెటెడ్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ (టెస్)ను జూన్ 30, 2022 వరకు కొనసాగించనున్నట్లు ప్రకటించింది.ఈ స్కీం ద్వారా బ్యాంకుల క్యాపిటల్ బఫర్ నిల్వలు, లిక్విడిటీ,స్టెబుల్ ఫండింగ్ రిక్వైర్ మెంట్లలో వెసులుబాటును కల్పించారు.ముఖ్యంగా దేశీయ బ్యాంకులకు క్యాపిటల్ బఫర్ కింద లిక్విడిటీ చర్యలు, లిక్విడిటీ కవరేజ్ రేషియో, ఎలిజిబుల్ లిక్విడ్ అసెట్స్ రేషియో, నెట్ స్టెబుల్ ఫండింగ్ రేషియో, అడ్వాన్సెస్ టు స్టేబుల్ రిసోర్స్ రేషియోపై తాత్కాలిక ప్రూడెన్షియల్ రిలీఫ్ను సెంట్రల్ బ్యాంకు అందిస్తోంది.కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థకు జరిగిన డ్యామేజ్ ను ఈ చర్యల తో తిరిగి గాడిలో పెట్టవచ్చని సెంట్రల్ బ్యాంక్ ధీమగా ఉంది.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









