అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు..
- December 19, 2021సౌదీ అరేబియా: కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సౌదీ ప్రజలు, ప్రవాసులు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలకు దూరంగా ఉండాలని సౌదీ పబ్లిక్ హెల్త్ అథారిటీ సూచించింది. ముఖ్యంగా హై రిస్క్ దేశాలకు వెళ్లొద్దని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వేగంగా పెరగడంపై సౌదీ హెల్త్ మినిస్ట్రీ ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ అరేబియాలోకి వచ్చే వారు వ్యాక్సిన్ తో సంబంధం లేకుండా కనీసం ఐదు రోజుల పాటు సోషల్ క్వారంటైన్ లో ఉండాలని, వ్యాధి లక్షణాలు కన్పిస్తే యాంటీ PCR పరీక్షను చేయించుకోవాలని హెల్త్ అథారిటీ సూచించింది. మాస్క్ పెట్టుకోవటం, రద్దీ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని, శానిటైజ్ చేసుకోవటం పాటించాలని కోరింది. బూస్టర్ డోస్ కు అర్హులైన వారంతా తప్పకుండా వ్యాక్సిన్ చేయించుకోవాలని ప్రజలకు హెల్త్ అథారిటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్