అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు..
- December 19, 2021
సౌదీ అరేబియా: కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సౌదీ ప్రజలు, ప్రవాసులు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలకు దూరంగా ఉండాలని సౌదీ పబ్లిక్ హెల్త్ అథారిటీ సూచించింది. ముఖ్యంగా హై రిస్క్ దేశాలకు వెళ్లొద్దని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వేగంగా పెరగడంపై సౌదీ హెల్త్ మినిస్ట్రీ ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ అరేబియాలోకి వచ్చే వారు వ్యాక్సిన్ తో సంబంధం లేకుండా కనీసం ఐదు రోజుల పాటు సోషల్ క్వారంటైన్ లో ఉండాలని, వ్యాధి లక్షణాలు కన్పిస్తే యాంటీ PCR పరీక్షను చేయించుకోవాలని హెల్త్ అథారిటీ సూచించింది. మాస్క్ పెట్టుకోవటం, రద్దీ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని, శానిటైజ్ చేసుకోవటం పాటించాలని కోరింది. బూస్టర్ డోస్ కు అర్హులైన వారంతా తప్పకుండా వ్యాక్సిన్ చేయించుకోవాలని ప్రజలకు హెల్త్ అథారిటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!