అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు..
- December 19, 2021
సౌదీ అరేబియా: కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సౌదీ ప్రజలు, ప్రవాసులు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలకు దూరంగా ఉండాలని సౌదీ పబ్లిక్ హెల్త్ అథారిటీ సూచించింది. ముఖ్యంగా హై రిస్క్ దేశాలకు వెళ్లొద్దని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వేగంగా పెరగడంపై సౌదీ హెల్త్ మినిస్ట్రీ ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ అరేబియాలోకి వచ్చే వారు వ్యాక్సిన్ తో సంబంధం లేకుండా కనీసం ఐదు రోజుల పాటు సోషల్ క్వారంటైన్ లో ఉండాలని, వ్యాధి లక్షణాలు కన్పిస్తే యాంటీ PCR పరీక్షను చేయించుకోవాలని హెల్త్ అథారిటీ సూచించింది. మాస్క్ పెట్టుకోవటం, రద్దీ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని, శానిటైజ్ చేసుకోవటం పాటించాలని కోరింది. బూస్టర్ డోస్ కు అర్హులైన వారంతా తప్పకుండా వ్యాక్సిన్ చేయించుకోవాలని ప్రజలకు హెల్త్ అథారిటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









