దుబాయ్ ఎక్స్ పో లో కరోనా కలకలం...జపాన్ పెవిలియన్లోని రెస్టారెంట్ సిబ్బందికి పాజిటివ్
- December 23, 2021
యూఏఈ: దుబాయ్ ఎక్స్ పో 2020 లో కరోనా కలకలం రేపింది. జపాన్ పెవిలియన్ కు చెందిన రెస్టారెంట్ లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వెంటనే రెస్టారెంట్ ను మూసివేశారు. అతనితో కాంటాక్ట్స్ అందరినీ ట్రేస్ చేస్తున్నారు. ఐతే రెస్టారెంట్ మాత్రమే తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు...పెవిలియన్ మాత్రం కొనసాగుతుందని జపాన్ ఎంబసీ ప్రకటించింది. ఇటీవల మళ్లీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్స్ పో లోని వర్క్ ఫోర్స్, ఇతర సిబ్బంది కి కరోనా టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో ఓ వ్యక్తి పాజిటివ్ గా తేలింది. దీంతో పరేడ్ లు, రోవింగ్ ఎంటర్ టైన్ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అటు యూఏఈ కరోనా నివారణకు సమర్థవంతంగా చర్యలు చేపట్టింది. ప్రపంచంలో అత్యధిక టీకా రేటు కలిగిన దేశం యూఏఈ యే కావటం విశేషం. ఇప్పటికే ఇక్కడ 96 శాతం జనాభాకు టీకాలు ఇచ్చారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







