దుబాయ్ ఎక్స్ పో లో కరోనా కలకలం...జపాన్ పెవిలియన్లోని రెస్టారెంట్ సిబ్బందికి పాజిటివ్
- December 23, 2021
యూఏఈ: దుబాయ్ ఎక్స్ పో 2020 లో కరోనా కలకలం రేపింది. జపాన్ పెవిలియన్ కు చెందిన రెస్టారెంట్ లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వెంటనే రెస్టారెంట్ ను మూసివేశారు. అతనితో కాంటాక్ట్స్ అందరినీ ట్రేస్ చేస్తున్నారు. ఐతే రెస్టారెంట్ మాత్రమే తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు...పెవిలియన్ మాత్రం కొనసాగుతుందని జపాన్ ఎంబసీ ప్రకటించింది. ఇటీవల మళ్లీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్స్ పో లోని వర్క్ ఫోర్స్, ఇతర సిబ్బంది కి కరోనా టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో ఓ వ్యక్తి పాజిటివ్ గా తేలింది. దీంతో పరేడ్ లు, రోవింగ్ ఎంటర్ టైన్ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అటు యూఏఈ కరోనా నివారణకు సమర్థవంతంగా చర్యలు చేపట్టింది. ప్రపంచంలో అత్యధిక టీకా రేటు కలిగిన దేశం యూఏఈ యే కావటం విశేషం. ఇప్పటికే ఇక్కడ 96 శాతం జనాభాకు టీకాలు ఇచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







