కోవిడ్ నిబంధనలను పాటించని హోటళ్లకు నోటీసులు
- December 26, 2021
ఒమన్: కోవిడ్-19 వ్యాప్తిని పరిమితం చేయడానికి ముందుజాగ్రత్త చర్యలను పాటించనందుకు హోటళ్లకు హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ (MHT) నోటీసులు జారీ చేసింది. భౌతిక దూరం నిబంధనను పాటించనందుకు మస్కట్ ఇంటర్కాంటినెంటల్ హోటల్, ట్రేడర్ విక్స్ రెస్టారెంట్ లకు నోటీసులు జారీ చేసినట్టు MHT తెలిపింది. ఇదే కారణంతో రమీ గెస్ట్ లైన్ హోటల్ కు కూడా నోటీసులు జారీ చేశారు. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ సహకరించాలని లేదంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హోటల్స్, టూరిజం సంస్థలను MHT హెచ్చరించింది. రెస్టారెంట్లు, మీటింగ్ హాల్స్,బ్యాంకెట్ హాల్స్ లో విజిటర్స్ సంఖ్యను మొత్తం సామర్థ్యంలో 50 శాతానికి తగ్గించాలని అన్ని సంస్థలను ఆదేశించింది. విజిటర్స్, ఎంప్లాయిస్ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి ఇతర నివారణ చర్యలు తీసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







