కోవిడ్ నిబంధనలను పాటించని హోటళ్లకు నోటీసులు
- December 26, 2021
ఒమన్: కోవిడ్-19 వ్యాప్తిని పరిమితం చేయడానికి ముందుజాగ్రత్త చర్యలను పాటించనందుకు హోటళ్లకు హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ (MHT) నోటీసులు జారీ చేసింది. భౌతిక దూరం నిబంధనను పాటించనందుకు మస్కట్ ఇంటర్కాంటినెంటల్ హోటల్, ట్రేడర్ విక్స్ రెస్టారెంట్ లకు నోటీసులు జారీ చేసినట్టు MHT తెలిపింది. ఇదే కారణంతో రమీ గెస్ట్ లైన్ హోటల్ కు కూడా నోటీసులు జారీ చేశారు. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ సహకరించాలని లేదంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హోటల్స్, టూరిజం సంస్థలను MHT హెచ్చరించింది. రెస్టారెంట్లు, మీటింగ్ హాల్స్,బ్యాంకెట్ హాల్స్ లో విజిటర్స్ సంఖ్యను మొత్తం సామర్థ్యంలో 50 శాతానికి తగ్గించాలని అన్ని సంస్థలను ఆదేశించింది. విజిటర్స్, ఎంప్లాయిస్ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి ఇతర నివారణ చర్యలు తీసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







