కోవిడ్ నిబంధనలను పాటించని హోటళ్లకు నోటీసులు

- December 26, 2021 , by Maagulf
కోవిడ్ నిబంధనలను పాటించని హోటళ్లకు నోటీసులు

ఒమన్: కోవిడ్-19 వ్యాప్తిని పరిమితం చేయడానికి ముందుజాగ్రత్త చర్యలను పాటించనందుకు హోటళ్లకు హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ (MHT) నోటీసులు జారీ చేసింది. భౌతిక దూరం నిబంధనను పాటించనందుకు మస్కట్ ఇంటర్‌కాంటినెంటల్ హోటల్‌, ట్రేడర్ విక్స్ రెస్టారెంట్‌ లకు నోటీసులు జారీ చేసినట్టు MHT తెలిపింది. ఇదే కారణంతో రమీ గెస్ట్ లైన్ హోటల్‌ కు కూడా నోటీసులు జారీ చేశారు. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ సహకరించాలని లేదంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హోటల్స్, టూరిజం సంస్థలను MHT  హెచ్చరించింది. రెస్టారెంట్లు, మీటింగ్ హాల్స్,బ్యాంకెట్ హాల్స్ లో విజిటర్స్ సంఖ్యను మొత్తం సామర్థ్యంలో 50 శాతానికి తగ్గించాలని అన్ని సంస్థలను ఆదేశించింది. విజిటర్స్, ఎంప్లాయిస్ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి ఇతర నివారణ చర్యలు తీసుకోవాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com