12 దేశాల్లో ‘రాధేశ్యామ్’ వీఎఫ్ఎక్స్ పనులు
- December 26, 2021
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్” ఇప్పుడు నిర్మాణ ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ చిత్రం 2022 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పుడు ఈ చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ‘రాధే శ్యామ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఆసక్తికరమైన అప్డేట్ను ఇచ్చారు. “ట్రైలర్లో చూపిన విఎఫ్ఎక్స్ వర్క్ కు అందరూ ఆశ్చర్యపోతున్నారు. క్రెడిట్ మొత్తం విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కమల్ కణ్ణన్కే చెందుతుంది. సినిమా కోసం అత్యుత్తమ అవుట్ పుట్ అందించడానికి వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ‘రాధే శ్యామ్’ విఎఫ్ఎక్స్ పనులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 దేశాల్లో జరుగుతున్నాయి” అని రాధా కృష్ణ అన్నారు.
“రాధే శ్యామ్” విఎఫ్ఎక్స్ పనులు 12 దేశాల్లో జరుగుతున్నాయని దర్శకుడు చెప్పడం చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస మాట్లాడుతూ “రాధే శ్యామ్” అందమైన విజువల్ కథనాన్ని అందిస్తారని, పెద్ద స్క్రీన్లపై మిస్ కాకూడదని అన్నారు. ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో నటించిన “రాధే శ్యామ్”ను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడుతుందా ? అనుకున్న సమయానికే వస్తుందా ? అంటే అది నిర్మాతల చేతుల్లో ఉంటుందని చెప్పుకొచ్చారు దర్శకుడు రాధాకృష్ణ.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!