అబుధాబిలో తొలి ముస్లిమేతర జంటకు మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ
- December 28, 2021
అబుధాబి: అబుధాబిలో ముస్లిమేతర జంటకు కోర్టు తొలిసారిగా మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ చేసింది. కెనడియన్ పౌరసత్వం ఉన్న జంటకు మొదటి సివిల్ మ్యారేజ్ కాంటాక్ట్ జారీ చేసింది. డిసెంబరు 14న కొత్త కోర్టును ప్రారంభించిన తర్వాత అరబ్ ప్రాంతంలో ఈ తరహా జారీ చేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా అబుధాబి జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ (ADJD) అండర్ సెక్రటరీ యూసఫ్ సయీద్ అల్ అబ్రీ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో శాసన, న్యాయ వ్యవస్థ కొనసాగుతున్న అభివృద్ధి ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తుందన్నారు. అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా ముస్లిమేతరుల సివిల్ పర్సనల్ చట్టాన్ని రూపొందించామన్నారు. వారి సంస్కృతి, ఆచారాలు, భాష పరంగా వారికి దగ్గరగా ఉండే గుర్తింపు పొందిన పౌర సూత్రాలకు దగ్గరగా ఉండేలా నిబంధనలు ఉన్నాయన్నారు. న్యాయ శాఖ యొక్క అధికారిక వెబ్సైట్లో సివిల్ మ్యారేజ్ కాంటాక్ట్ సర్వీస్ రెసిడెంట్స్, విజిటర్స్ కోసం అందుబాటులో ఉందన్నారు. నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రిమోట్గా జరుగుతుందని అల్ అబ్రీ అన్నారు.
తాజా వార్తలు
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!







