అబుధాబిలో తొలి ముస్లిమేతర జంటకు మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ
- December 28, 2021
అబుధాబి: అబుధాబిలో ముస్లిమేతర జంటకు కోర్టు తొలిసారిగా మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ చేసింది. కెనడియన్ పౌరసత్వం ఉన్న జంటకు మొదటి సివిల్ మ్యారేజ్ కాంటాక్ట్ జారీ చేసింది. డిసెంబరు 14న కొత్త కోర్టును ప్రారంభించిన తర్వాత అరబ్ ప్రాంతంలో ఈ తరహా జారీ చేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా అబుధాబి జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ (ADJD) అండర్ సెక్రటరీ యూసఫ్ సయీద్ అల్ అబ్రీ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో శాసన, న్యాయ వ్యవస్థ కొనసాగుతున్న అభివృద్ధి ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తుందన్నారు. అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా ముస్లిమేతరుల సివిల్ పర్సనల్ చట్టాన్ని రూపొందించామన్నారు. వారి సంస్కృతి, ఆచారాలు, భాష పరంగా వారికి దగ్గరగా ఉండే గుర్తింపు పొందిన పౌర సూత్రాలకు దగ్గరగా ఉండేలా నిబంధనలు ఉన్నాయన్నారు. న్యాయ శాఖ యొక్క అధికారిక వెబ్సైట్లో సివిల్ మ్యారేజ్ కాంటాక్ట్ సర్వీస్ రెసిడెంట్స్, విజిటర్స్ కోసం అందుబాటులో ఉందన్నారు. నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రిమోట్గా జరుగుతుందని అల్ అబ్రీ అన్నారు.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







