ఏపీ కరోనా అప్డేట్

- December 28, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

ఏపీ: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. గతరోజు 100కి లోపే కొత్త కేసులు నమోదవగా, ఈసారి ఆ సంఖ్య వందను దాటింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 30వేల 752 శాంపిల్స్ పరీక్షించగా, 141 మందికి కొవిడ్ పాజటివ్ గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ తో మరో ఇద్దరు చనిపోయారు.విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 165 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 1073 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 492కి పెరిగింది. ఇప్పటివరకు 20,76,687 కేసులు నమోదవగా 20,61,122 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,12,30,356 శాంపిల్స్ పరీక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com