2-3 రోజుల్లో ఒమిక్రాన్ రెట్టింపు అయ్యే అవకాశం: WHO
- December 29, 2021
జెనీవా: గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందింది.అగ్రదేశమైన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశాలు ఒమిక్రాన్ కంటే ముందు వచ్చిన డెల్టా వేరియంట్తోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నాయి.అయితే ఇప్పుడు ఒమిక్రాన్ సోకిన దేశాల్ల విజృంభిస్తోంది.ఇటీవల భారత్లోకి కూడా ఈ వేరియంట్ ప్రవేశించి భారతీయులపై విరుచుకుపడుతోంది.
అయితే తాజాగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులపై డబ్ల్యూహెచ్వో స్పందించింది.డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా విజృంభిస్తోందని, ఇప్పటికే యూకే,యూఎస్ దేశాలలో ఒమిక్రాన్ మరణాలు కూడా సంభవిస్తున్నాయని వెల్లడించింది.అయితే డిసెంబర్ 20 నుంచి 26 వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య అనుహ్యంగా పెరిగిందని, అంతేకాకుండా రానున్న 2-3 రోజుల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.ఇప్పటికే ఒమిక్రాన్పై జాగ్రత్త వహించాలని దేశాలకు సూచించనట్లు తెలిపింది.అయితే భారత్లో కూడా ఒమిక్రాన్ దాని ప్రభావాన్ని చూపుతోంది. నిన్న ఒక్క రోజే 127 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా గత వారం వరకు 7వేల లోపు నమోదైన కరోనా కేసులు తాజాగా 9వేలకు పైగా నమోదయ్యాయి.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు