భారత్లో తొలి ఒమిక్రాన్ మరణం..
- December 31, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ తొలి మరణం నమోదైంది. మహారాష్ట్రకు చెందిన ఒమిక్రాన్ బాధితుడు గుండెపోటుతో మృతి చెందాడు.పూణేలోని పింప్రీ చించువాడ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్తో ప్రాణాలు కోల్పోయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.యశ్వంత్ రావు చవాన్ ఆస్పత్రిలో సదరు బాధితుడు కరోనాకు చికిత్స పొందుతూ ఈ నెల(డిసెంబర్)28న మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.అతడు గుండెపోటుతో చనిపోగా.. అనంతరం అతడికి చేసిన పరీక్షల్లో ఒమిక్రాన్గా నిర్థరాణ అయినట్లు చెప్పారు.
చనిపోయిన వ్యక్తికి ట్రావెల్ హిస్టరీ ఉందని.. నైజీరియా నుంచి వచ్చినట్లు మహారాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. అతడు గత 13 ఏళ్ల నుంచి డయాబెటిస్తో బాధపడుతున్నట్లు తెలిపింది. 'బాధితుడు మరణానికి కరోనా కారణం కాదు.. కానీ, యాదృచ్ఛికంగా పుణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబొరేటరీ నివేదిక అతడికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నిర్ధారించింది' అని మహా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!