ఢిల్లీ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

- December 31, 2021 , by Maagulf
ఢిల్లీ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

న్యూ ఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు.దుబాయ్ ప్రయాణికుడి వద్ద 45 లక్షల విలువ చేసే వివిధ దేశాల కరెన్సీని సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది గుర్తించింది. భద్రతా సిబ్బంది నిర్వహించిన స్కానింగ్‌లో కరెన్సీ అక్రమ రవాణా బయట పడింది. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.కరెన్సీని సీజ్ చేశారు.ప్రయాణికుడిపై సెక్షన్ 110 కస్టమ్స్ యాక్ట్ 1962 కింద కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com