తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

- January 04, 2022 , by Maagulf
తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరోసారి వికృత రూపం దాల్చుతోంది. కొత్త కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా కరోనా ప్రభావంతో యావత్తు దేశంతో పాటు తెలంగాణవాసులూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ కూడా తెలంగాణలో వ్యాప్తి చెందుతుండడంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది.

అయితే తాజాగా తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 1,052 కరోనా కేసులు రాగా, ఇద్దరు కరోనాతో మృతి చెందారు. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో మరో 240 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 94కి ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com