ఖతార్ లో కొత్త కోవిడ్ ఆంక్షలు.. వ్యాక్సిన్ తీసుకునోళ్లకు మాత్రమే మాల్స్లో ఎంట్రీ
- January 06, 2022
ఖతార్: COVID-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖతార్ క్యాబినెట్ కొత్త ఆంక్షలను ప్రకటించింది. ఇవి జనవరి 8 నుండి అమలులోకి రానున్నాయి.కొత్త నిబంధనల ప్రకారం.. పాఠశాలలు, కిండర్ గార్టెన్లలోని విద్యార్థులకు 27 జనవరి 2022 వరకు ఆన్లైన్ క్లాసులను కొనసాగిస్తారు. వివాహం, పార్టీలు 30 శాతం సామర్థ్యంతో గరిష్టంగా 40 మంది వ్యక్తులతో ఇంటి లోపల జరుపుకునేందుకు అనుమతిస్తారు. ఆరుబయట వివాహాలకు 50 శాతం సామర్థ్యంతో (80 మంది కంటే తక్కువ మంది ) అనుమతిస్తారు. పూర్తిగా టీకాలు తీసుకున్న వ్యక్తులకు మాత్రమే మాల్స్లోకి అనుమతించబడతారు. "ఖతార్ క్లీన్" ప్రోగ్రామ్ సర్టిఫికేట్ ఉన్నవారికి రెస్టారెంట్లు, కేఫ్లు 50 శాతం ఇండోర్, 75 శాతం కెపాసిటీ అవుట్డోర్లో తెరిచి ఉంటాయి. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు టీకాలు వేసిన పెద్దలతో పాటు మాత్రమే అనుమతించబడతారు. మార్కెట్లు వారంలోని అన్ని రోజులలో పనిచేస్తాయి. సామర్థ్యం 75% మించకూడదు. పబ్లిక్ పార్కులు, బీచ్లు, కార్నిచ్లలో గుమిగూడేందుకు ఇప్పటికీ గరిష్టంగా 15 మంది వ్యక్తులు లేదా ఒకే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులను అనుమతిస్తారు. ఉద్యానవనాలు, వినోద కేంద్రాలు, ఈత కొలనులు, నీటి పార్కులు బహిరంగ ప్రదేశాల్లో 75 శాతానికి మించకుండా 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి. ప్రార్థనల కోసం మసీదులు తెరిచి ఉంటాయి, కానీ 12 ఏళ్లలోపు వారిని అనుమతించరు.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







