కార్‌ షోరూమ్‌ ఓనర్‌కి బురిడీ

- March 26, 2016 , by Maagulf
కార్‌ షోరూమ్‌ ఓనర్‌కి బురిడీ

కార్‌ షోరూమ్‌లో పనిచేస్తున్న ముగ్గురు శ్రీలంకకు చెందిన వ్యక్తులు ఏడు కార్లను 2.8 మిలియన్‌ డార్లకు అమ్మేశారు. అది కూడా ఓనర్‌కి తెలియకుండా, ఆయన లేని సమయంలో. కజకిస్తాన్‌కి చెందిన ఓ వ్యక్తి, తన పార్టనర్‌తో కలిసి వేరే దేశానికి వెళ్ళిన సమయంలో, ముగ్గురు స్టాఫ్‌ మెంబర్స్‌, సెకెండ్‌ హ్యాండ్‌ కార్లను ఇద్దరికి అమ్మేయడం జరిగింది. ఆర్‌టిఎ అనుమతి పత్రాలను మాత్రం ఇవ్వలేదు. మే 22న కార్‌ డీలర్‌ స్వదేశానికి వచ్చి, తన షోరూమ్‌ ఖాళీ అవడం, ముగ్గురు స్టాఫ్‌ మెంబర్స్‌ లేకపోవడం గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే ఈ ముగ్గురూ దేశం విడిచి, స్వదేశానికి వెళ్ళిపోయారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com