అబుధాబిలో న్యూ బార్డర్ రూల్స్
- January 13, 2022
అబుధాబి: యూఏఈ నుండి ఎమిరేట్కు ప్రయాణించే వారి కోసం అబుధాబి కొత్త సరిహద్దు నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇందులో టూరిస్ట్ ల చెకింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వారి చెకింగ్ ప్రక్రియ వేగంగా పూర్తి అయ్యేందుకు సఫరెట్ చెకింగ్ లైన్ ను ఏర్పాటు చేయనున్నారు. అబుధాబికి విసిట్ ప్లాన్ చేయడానికి ముందు, ప్రవేశ మార్గదర్శకాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని టూరిజం ఆపరేటర్లకు డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం (DCT) ఒక సర్క్యులర్ జారీ చేసింది. అబుధాబి - దుబాయ్ బార్డర్ లో ఎమిరేట్ - లేన్ 1 (కుడివైపు)లోకి ప్రవేశించేటప్పుడు పర్యాటకుల ప్రత్యేక లేన్ను తీసుకోవాలని డ్రైవర్లకు తెలియజేయాలని అందులో సూచించింది. ఎంట్రీ పాయింట్ల వద్ద తనిఖీ కోసం సంబంధిత డాక్యుమెంటేషన్ను సిద్ధంగా పెట్టుకోవాలి అని సర్క్యులర్లో DCT స్పష్టం చేసింది. అలాగే కోవిడ్-వ్యాక్సినేషన్ పొందిన వ్యక్తులు UAE నుండి అబుధాబిలోకి ప్రవేశించాలనుకునేవారు అల్ హోస్న్ యాప్లో గ్రీన్ పాస్ కలిగి ఉండాలన్నారు. కోవిడ్-19 పరీక్షలో నెగిటివ్ వచ్చినప్పుడు 15 రోజుల పాటు గ్రీన్ స్టేటస్ యాక్టివేట్ చేయబడుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







