అబుధాబిలో న్యూ బార్డర్ రూల్స్
- January 13, 2022
అబుధాబి: యూఏఈ నుండి ఎమిరేట్కు ప్రయాణించే వారి కోసం అబుధాబి కొత్త సరిహద్దు నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇందులో టూరిస్ట్ ల చెకింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వారి చెకింగ్ ప్రక్రియ వేగంగా పూర్తి అయ్యేందుకు సఫరెట్ చెకింగ్ లైన్ ను ఏర్పాటు చేయనున్నారు. అబుధాబికి విసిట్ ప్లాన్ చేయడానికి ముందు, ప్రవేశ మార్గదర్శకాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని టూరిజం ఆపరేటర్లకు డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం (DCT) ఒక సర్క్యులర్ జారీ చేసింది. అబుధాబి - దుబాయ్ బార్డర్ లో ఎమిరేట్ - లేన్ 1 (కుడివైపు)లోకి ప్రవేశించేటప్పుడు పర్యాటకుల ప్రత్యేక లేన్ను తీసుకోవాలని డ్రైవర్లకు తెలియజేయాలని అందులో సూచించింది. ఎంట్రీ పాయింట్ల వద్ద తనిఖీ కోసం సంబంధిత డాక్యుమెంటేషన్ను సిద్ధంగా పెట్టుకోవాలి అని సర్క్యులర్లో DCT స్పష్టం చేసింది. అలాగే కోవిడ్-వ్యాక్సినేషన్ పొందిన వ్యక్తులు UAE నుండి అబుధాబిలోకి ప్రవేశించాలనుకునేవారు అల్ హోస్న్ యాప్లో గ్రీన్ పాస్ కలిగి ఉండాలన్నారు. కోవిడ్-19 పరీక్షలో నెగిటివ్ వచ్చినప్పుడు 15 రోజుల పాటు గ్రీన్ స్టేటస్ యాక్టివేట్ చేయబడుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







