భారత్ కరోనా అప్డేట్
- January 13, 2022న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి తగ్గేదేలే అన్న విధంగా రోజురోజకు విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడంతో రోజూ కరోనా కేసులు భారీగా నమోదవతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు. అంతేకాకుండా నేడు ప్రధాని మోడీ రాష్ట్రాల సీఎంలతో కోవిడ్ విజృంభనపై సమీక్షించానున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా 2,47,417 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు గడచిన 24 గంటల్లో మరో 84,825 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే దేశంలో ప్రస్తుతం 13.11 శాతం కరోనా పాజిటివిటీ రేటు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
అంతేకాకుండా దేశవ్యాప్తంగా 11,17,531 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ, రైల్వే బస్టాండ్లు ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో కూడా భక్తులు తాకిడి అధికంగా ఉంది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్ అంక్షలు విధిస్తూ భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. బస్సులు, రైల్వే స్టేషన్లో కూడా కోవిడ్ నిబంధనలు కఠినతరం చేశారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







