భారత్ కరోనా అప్డేట్
- January 13, 2022న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి తగ్గేదేలే అన్న విధంగా రోజురోజకు విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడంతో రోజూ కరోనా కేసులు భారీగా నమోదవతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు. అంతేకాకుండా నేడు ప్రధాని మోడీ రాష్ట్రాల సీఎంలతో కోవిడ్ విజృంభనపై సమీక్షించానున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా 2,47,417 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు గడచిన 24 గంటల్లో మరో 84,825 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే దేశంలో ప్రస్తుతం 13.11 శాతం కరోనా పాజిటివిటీ రేటు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
అంతేకాకుండా దేశవ్యాప్తంగా 11,17,531 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ, రైల్వే బస్టాండ్లు ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో కూడా భక్తులు తాకిడి అధికంగా ఉంది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్ అంక్షలు విధిస్తూ భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. బస్సులు, రైల్వే స్టేషన్లో కూడా కోవిడ్ నిబంధనలు కఠినతరం చేశారు.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









