'బూస్టర్ డోస్ కోసం పేర్లను నమోదు చేసుకోండి'
- January 19, 2022
కువైట్: యాంటీ కరోనా వైరస్ వ్యాక్సిన్ 'థర్డ్ బూస్టర్ డోస్' తీసుకోవడానికి ప్రైవేట్ నర్సరీల యజమానులు తమ ఉద్యోగుల పేర్లను నమోదు చేసుకోవాలని సోషల్ ఎఫైర్స్, కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అబ్దుల్ అజీజ్ షుయబ్ పిలుపునిచ్చారు. జనవరి 27న సాల్మియా ప్రాంతంలోని ప్రైవేట్ నర్సరీల్లోని కార్మికులందరికీ కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించేందుకు క్యాంపెయిన్ ను ప్రారంభించనున్నట్లు అజీజ్ తెలిపారు. నర్సరీ యజమానులు తమ ఉద్యోగులకు వైరస్ బారిన పడకుండా వ్యాక్సిన్లు వేయడానికి గతంలో నిర్వహించిన టీకా ప్రచారాల సందర్భంగా నర్సరీ యాజమాన్యం అందించిన సహకారాన్ని ఆయన ప్రశంసించారు. రెండవ డోస్ తీసుకున్న 6 నెలలు దాటిన వారికి మూడవ బూస్టర్ డోస్ ఇవ్వబడుతుందన్నారు. నర్సరీల యజమానులు https://forms.gle/piTjusAgbpHjGHAv5 అనే వెబ్సైట్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ క్యాంపెయిన్లో పాల్గొనాలని షుయబ్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







