'బూస్టర్ డోస్ కోసం పేర్లను నమోదు చేసుకోండి'
- January 19, 2022
కువైట్: యాంటీ కరోనా వైరస్ వ్యాక్సిన్ 'థర్డ్ బూస్టర్ డోస్' తీసుకోవడానికి ప్రైవేట్ నర్సరీల యజమానులు తమ ఉద్యోగుల పేర్లను నమోదు చేసుకోవాలని సోషల్ ఎఫైర్స్, కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అబ్దుల్ అజీజ్ షుయబ్ పిలుపునిచ్చారు. జనవరి 27న సాల్మియా ప్రాంతంలోని ప్రైవేట్ నర్సరీల్లోని కార్మికులందరికీ కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించేందుకు క్యాంపెయిన్ ను ప్రారంభించనున్నట్లు అజీజ్ తెలిపారు. నర్సరీ యజమానులు తమ ఉద్యోగులకు వైరస్ బారిన పడకుండా వ్యాక్సిన్లు వేయడానికి గతంలో నిర్వహించిన టీకా ప్రచారాల సందర్భంగా నర్సరీ యాజమాన్యం అందించిన సహకారాన్ని ఆయన ప్రశంసించారు. రెండవ డోస్ తీసుకున్న 6 నెలలు దాటిన వారికి మూడవ బూస్టర్ డోస్ ఇవ్వబడుతుందన్నారు. నర్సరీల యజమానులు https://forms.gle/piTjusAgbpHjGHAv5 అనే వెబ్సైట్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ క్యాంపెయిన్లో పాల్గొనాలని షుయబ్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







