ఉగ్రదాడిపై మాట్లాడిన ఇండియా-యూఏఈ మినిస్టర్లు.. భారతీయుల మృతిపై విచారం
- January 19, 2022న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి డాక్టర్. ఎస్. జైశంకర్.. యూఏఈ విదేశాంగ మంత్రి హెచ్హెచ్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్ లో మాట్లాడారు. యూఏఈపై జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు భారతీయులు చనిపోవడంపై వారు చర్చించారు. దాడికి సంబంధించిన వివరాలను యూఏఈ విదేశాంగ మంత్రి జైశంకర్ తో పంచుకున్నారు. ఇద్దరు భారతీయుల మృతి పట్ల యూఏఈ ప్రభుత్వం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. మృతుల కుటుంబాలకు యూఏఈ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. భారత రాయబార కార్యాలయంతో తమ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా జైశంకర్ తీవ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. అమాయక పౌరులపై ఇటువంటి దాడి పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, నాగరిక సమాజానికి ఇది విరుద్ధంగా ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఈ విపత్కర పరిస్థితిలో యూఏఈ అధికారులు ఎంబసీకి అందించిన సహాయాన్ని అభినందించారు.
ఉగ్రదాడి జరిగినప్పుడు UAEకి భారతదేశం సంఘీభావాన్ని భారత విదేశాంగ శాఖ తెలియజేసింది. ఈ సమస్యపై అంతర్జాతీయ వేదికలపై భారతదేశం UAEకి అండగా నిలుస్తుందని ప్రకటించింది. మరణించిన వారి మృత దేహాలను భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అబుదాబిలోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతోంది. ఎంబసీ కుటుంబాలతో సమన్వయం చేస్తోంది. గాయపడిన వారికి అవసరమైన అన్ని సహాయాన్ని కూడా పర్యవేక్షిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?