మనీ లాండరింగ్: 9 మంది సభ్యుల ముఠాపై విచారణ

- January 19, 2022 , by Maagulf
మనీ లాండరింగ్: 9 మంది సభ్యుల ముఠాపై విచారణ

యూఏఈ: మోసాలు, దొంగతనాల ద్వారా సేకరించిన సొమ్ము ద్వారా మనీ లాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న 9 మంది సభ్యుల ముఠాని కోర్టుకు రిఫర్ చేయాలని ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు ఉద్యోగులుగా వ్యవహరిస్తూ, ఖాతాదారుల్ని నిందితులు దోచుకుంటున్నట్లు విచారణలో తేలింది. బాధితుల బ్యాంక్ అక్కౌంట్ల సమాచారాన్ని వివిధ రూపాల్లో సేకరించి నిందితులు మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే, ఆయా బ్యాంకుల్ని ఫోర్జరీ ద్వారా నిందితులు కొల్లగొట్టినట్లు కూడా అభియోగాలున్నాయి. నిందితులకు అత్యధికమైన స్థాయిలో శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరనున్నట్లు పబ్లిక్ప్రాసిక్యూషన్ పేర్కొంది. 300,000 దిర్హాములకు తగ్గకుండా 10,000,000 దిర్హాములకు మించకుండా నిందితులకు జరీమానా పడాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com