మనీ లాండరింగ్: 9 మంది సభ్యుల ముఠాపై విచారణ
- January 19, 2022
యూఏఈ: మోసాలు, దొంగతనాల ద్వారా సేకరించిన సొమ్ము ద్వారా మనీ లాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న 9 మంది సభ్యుల ముఠాని కోర్టుకు రిఫర్ చేయాలని ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు ఉద్యోగులుగా వ్యవహరిస్తూ, ఖాతాదారుల్ని నిందితులు దోచుకుంటున్నట్లు విచారణలో తేలింది. బాధితుల బ్యాంక్ అక్కౌంట్ల సమాచారాన్ని వివిధ రూపాల్లో సేకరించి నిందితులు మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే, ఆయా బ్యాంకుల్ని ఫోర్జరీ ద్వారా నిందితులు కొల్లగొట్టినట్లు కూడా అభియోగాలున్నాయి. నిందితులకు అత్యధికమైన స్థాయిలో శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరనున్నట్లు పబ్లిక్ప్రాసిక్యూషన్ పేర్కొంది. 300,000 దిర్హాములకు తగ్గకుండా 10,000,000 దిర్హాములకు మించకుండా నిందితులకు జరీమానా పడాల్సి వుంది.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









