కేసు వెనక్కి తీసుకోవాలని కోరుతున్న వైకల్యంతో బాధపడుతున్న వలసదారుడు
- January 19, 2022
బహ్రెయిన్: భారత వలసదారుడు సుధాకర్ రాధాకృష్ణన్, వైకల్యం కారణంగా కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా యజమానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 2017లో సుధాకర్ బహ్రెయిన్ వచ్చారు 450 బహ్రెయినీ దినార్ల వేతనం కలిగిన ఉద్యోగం ద్వారా. పదిహేడు నెలలపాటు పని చేసిన తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగిందనీ, తన సోదరుడు గాయపడ్డంతో వెళ్ళాల్సి వచ్చిందనీ, తిరిగి వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయని సుధాకర్ చెప్పారు. తన వల్ల కంపెనీ నష్టపోయిందంటూ కంపెనీ యాజమాన్యం వేతనాన్ని చెల్లించడం మానేసిందని అన్నారాయన. నష్టాల నేపథ్యంలో 3,800 బహ్రెయినీ దినార్లు చెల్లించాల్సిందిగా యాజమాన్యం డిమాండ్ చేసిందన్నారు. కంపెనీ కేసు కూడా నమోదు చేసింది. దాంతో అతనిపై ట్రావెల్ బ్యాన్ విధించడం జరిగింది. హిద్ పోలీసుల ప్రమేయంతో వివాదం సద్దుమణిగి ట్రావెల్ బ్యాన్ ఎత్తివేయడంతో, 21 జనవరి 2019న స్వదేశానికి వెళ్ళారు సుధాకర్. ఐదు నెలల తర్వాత వేరే యజమాని వద్ద పని దొరకడంతో మళ్ళీ బహ్రెయిన్ వచ్చారు. అనంతరం తీవ్రమైన వెన్ను సమస్య రావడంతో పని చేయడానికి వీల్లేని పరిస్థితి వచ్చింది. తిరిగి స్వదేశానికి వచ్చేద్దామనుకుంటే తన మీద ట్రావెల్ బ్యాన్ వున్నట్లు తెలిసి డీలాపడ్డారు సుధాకర్. కొత్త కేసు తన మీద బనాయించబడిందనీ, 13,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాల్సిందిగా ఆ కేసులో పేర్కొన్నారనీ, నడవలేని పరిస్థితుల్లో వున్న తానెలా ఆ మొత్తాన్ని చెల్లించగలనని ఆవేదన చెందుతూ, సాయం కోరుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!