శబరిమలలో భారీగా పేలుడు పదార్ధాల కలకలం..అలెర్ట్ అయిన కేరళ యంత్రాంగం

- January 20, 2022 , by Maagulf
శబరిమలలో భారీగా పేలుడు పదార్ధాల కలకలం..అలెర్ట్ అయిన కేరళ యంత్రాంగం

కేరళ: శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. దీంతో పోలీసులు, ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో పెన్ ఘాట్ వంతెన కింద జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఇవి ఎక్కడ నుంచి వచ్చాయనే అంశంపై భద్రతా అధికారులు విచారణ మొదలు పెట్టారు. ఎవరు తీసుకువచ్చారనే దానిపై విచారణ జరుగుతోంది. మొత్తంగా 6 జిలెటిన్ స్టిక్స్ లను స్వాధీనం చేసుకున్నారు. బాంబ్ స్వ్యాడ్ మొత్తం తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు బాంబు స్క్వాడ్‌ సాయంతో ఆలయ మార్గంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com