ఇండియన్ ఎంబసీలో వర్చువల్‌గా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్

- January 21, 2022 , by Maagulf
ఇండియన్ ఎంబసీలో వర్చువల్‌గా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్

కువైట్: కోవిడ్-19 సంబంధిత ప్రోటోకాల్, మార్గదర్శకాలకు అనుగుణంగా జనవరి 26న ఇండియన్ ఎంబసీ భారత రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది. ఎంబసీ ప్రాంగణంలో జరిగే ఈవెంట్‌కు భారతీయ ప్రవాసులు, భారతీయ స్నేహితులందరినీ వర్చువల్ గా పాల్గొనాలని  ఆహ్వానిస్తోంది. రాయబారి సిబి జార్జ్ ఉదయం 9 గంటలకు ఎంబసీ ప్రాంగణంలో జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవనీయులైన రాష్ట్రపతి సందేశాన్ని చదువుతారు. జనవరి 26న ఉదయం 9:00 గంటల నుండి 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వర్చువల్‌గా పాల్గొని జాతీయ గీతాలాపనలో పాల్గొనాలని ఎంబసీ అందరినీ ఆహ్వానిస్తోంది. ఈవెంట్ ను ఎంబసీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈవెంట్ కోసం జూమ్ లింక్ https://zoom.us/j/91063589125?pwd=SlpnWmZsWG9SSHF5RTFZd2hPU2Ezdz09 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com