దుబాయ్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి, 12 మందికి గాయాలు
- January 21, 2022
దుబాయ్: బుధవారం దుబాయ్ లో జరిగిన మూడు వేర్వేరు ట్రాఫిక్ ప్రమాదాల్లో ఒక మహిళ మరణించగా, మరో 12 మంది గాయపడ్డారని దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ వెల్లడించారు. జైయ్ వాకింగ్, మితిమీరిన వేగం, క్రమశిక్షణ పాటించకపోవడం వంటి ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించడం వల్లే ప్రమాదాలు జరిగాయని బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. అల్ కరామా సొరంగంలో తెల్లవారుజామున జరిగిన మొదటి ప్రమాదంలో ఒక బస్సు తేలికపాటి వాహనాన్ని ఢీకొట్టడంతో పది మందికి స్వల్ప గాయాలయ్యాయని ఆయన వివరించారు. దుబాయ్ హిల్స్ కు ఎదురుగా ఉమ్ సుఖీమ్ రోడ్లో రెండు లైట్ వెహికల్స్ ఢీకొనడంతో రెండో ప్రమాదం జరిగిందని, లేన్ క్రమశిక్షణను పాటించని కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, ఇందులో ఇద్దరికి స్వల్ప గాయలు అయ్యాయని అల్ మజ్రోయి వివరించారు. అల్ ఖైల్ రోడ్లో రన్ ఓవర్ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందిందని అల్ మజ్రోయి తెలిపారు. మరణించిన వ్యక్తి గుర్తించబడని ప్రాంతం నుండి హైవేని దాటడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. మితిమీరిన వేగం, ఓవర్టేకింగ్ నిబంధనలు పాటించకపోవడం, అకస్మాత్తుగా ఊగిసలాట, డ్రైవింగ్ చేసేటప్పుడు దృష్టి మరల్చడం వంటి వాటిపై దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రజలు ఎల్లప్పుడూ ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







