దుబాయ్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి, 12 మందికి గాయాలు
- January 21, 2022
దుబాయ్: బుధవారం దుబాయ్ లో జరిగిన మూడు వేర్వేరు ట్రాఫిక్ ప్రమాదాల్లో ఒక మహిళ మరణించగా, మరో 12 మంది గాయపడ్డారని దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ వెల్లడించారు. జైయ్ వాకింగ్, మితిమీరిన వేగం, క్రమశిక్షణ పాటించకపోవడం వంటి ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించడం వల్లే ప్రమాదాలు జరిగాయని బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. అల్ కరామా సొరంగంలో తెల్లవారుజామున జరిగిన మొదటి ప్రమాదంలో ఒక బస్సు తేలికపాటి వాహనాన్ని ఢీకొట్టడంతో పది మందికి స్వల్ప గాయాలయ్యాయని ఆయన వివరించారు. దుబాయ్ హిల్స్ కు ఎదురుగా ఉమ్ సుఖీమ్ రోడ్లో రెండు లైట్ వెహికల్స్ ఢీకొనడంతో రెండో ప్రమాదం జరిగిందని, లేన్ క్రమశిక్షణను పాటించని కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, ఇందులో ఇద్దరికి స్వల్ప గాయలు అయ్యాయని అల్ మజ్రోయి వివరించారు. అల్ ఖైల్ రోడ్లో రన్ ఓవర్ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందిందని అల్ మజ్రోయి తెలిపారు. మరణించిన వ్యక్తి గుర్తించబడని ప్రాంతం నుండి హైవేని దాటడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. మితిమీరిన వేగం, ఓవర్టేకింగ్ నిబంధనలు పాటించకపోవడం, అకస్మాత్తుగా ఊగిసలాట, డ్రైవింగ్ చేసేటప్పుడు దృష్టి మరల్చడం వంటి వాటిపై దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రజలు ఎల్లప్పుడూ ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్