దుబాయ్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి, 12 మందికి గాయాలు
- January 21, 2022
దుబాయ్: బుధవారం దుబాయ్ లో జరిగిన మూడు వేర్వేరు ట్రాఫిక్ ప్రమాదాల్లో ఒక మహిళ మరణించగా, మరో 12 మంది గాయపడ్డారని దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ వెల్లడించారు. జైయ్ వాకింగ్, మితిమీరిన వేగం, క్రమశిక్షణ పాటించకపోవడం వంటి ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించడం వల్లే ప్రమాదాలు జరిగాయని బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. అల్ కరామా సొరంగంలో తెల్లవారుజామున జరిగిన మొదటి ప్రమాదంలో ఒక బస్సు తేలికపాటి వాహనాన్ని ఢీకొట్టడంతో పది మందికి స్వల్ప గాయాలయ్యాయని ఆయన వివరించారు. దుబాయ్ హిల్స్ కు ఎదురుగా ఉమ్ సుఖీమ్ రోడ్లో రెండు లైట్ వెహికల్స్ ఢీకొనడంతో రెండో ప్రమాదం జరిగిందని, లేన్ క్రమశిక్షణను పాటించని కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, ఇందులో ఇద్దరికి స్వల్ప గాయలు అయ్యాయని అల్ మజ్రోయి వివరించారు. అల్ ఖైల్ రోడ్లో రన్ ఓవర్ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందిందని అల్ మజ్రోయి తెలిపారు. మరణించిన వ్యక్తి గుర్తించబడని ప్రాంతం నుండి హైవేని దాటడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. మితిమీరిన వేగం, ఓవర్టేకింగ్ నిబంధనలు పాటించకపోవడం, అకస్మాత్తుగా ఊగిసలాట, డ్రైవింగ్ చేసేటప్పుడు దృష్టి మరల్చడం వంటి వాటిపై దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రజలు ఎల్లప్పుడూ ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







