విదేశీ ప్రయాణికులకు శుభవార్త...
- January 22, 2022
న్యూ ఢిల్లీ: భారత్కు వచ్చే విదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా కరోనా మూడో వేవ్ కొనసాగుతోంది. రోజువారీ కరోనా కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపడుతున్నాయి. కరోనా కట్టడికి కఠిన ఆంక్షలను విధిస్తూనే మరోవైపు ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఐసోలేషన్ నిబంధనలకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
విదేశీ టూరిస్టుల ఐసోలేషన్ నిబంధనల్లో మార్పులు చేసింది. విదేశీ ప్రయాణికుల రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. ఈ కొత్త నిబంధనలు జనవరి 22న అమలులోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం.. ఎయిర్పోర్ట్లో నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారికి గతంలో మాదిరిగా ఐసోలేషన్ కేంద్రంలో ఉండటం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. కరోనా రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు సాధారణ కొవిడ్ ప్రోటోకాల్ అనుసరిస్తే సరిపోతుందని వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ మార్గదర్శకాలనే అమలు చేయాలని అధికారులకు సూచనలు చేసింది.
విదేశీ ప్రయాణికుల కోసం సవరించిన మార్గదర్శకాలు మినహా మిగతా నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా ముప్పు అధికంగా ఉండే దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు కూడా కొత్త నిబంధనలే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో కేంద్రం తెలిపింది. ఎయిర్ పోర్టుల వద్ద స్క్రీనింగ్ సమయంలో వైరస్ లక్షణాలు ఉంటే.. ప్రయాణికులు వెంటనే ఐసోలేషన్కు వెళ్లాలని కొవిడ్ ప్రొటోకాల్ సూచిస్తోంది. ప్రైమరీ కాంటాక్ట్లను కూడా గుర్తించి కరోనా టెస్టులను నిర్వహించాలని చెబుతోంది. భారత్కు వచ్చిన విదేశీయులు కరోనా పాజిటివ్ నిర్ధారణ తర్వాత ఏడు రోజులు హోం క్వారెంటైన్లో ఉండాల్సి ఉంటుంది. 8వ రోజు నెగటివ్ వచ్చిన తరువాత కూడా మరో 7 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్లోనే ఉండాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!