భారత్లో కరోనా కేసుల వివరాలు
- January 25, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా దేశంలో 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 50,190 కేసులు తక్కువగా కేసులు నమోదయ్యాయి. అయితే, గడిచిన 24 గంటల వ్యవధిలో 614 మంది కరోనాతో మృతి చెందారు. 2,67,753 మంది కొలుకొని డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. ఇక దేశంలో ప్రస్తుతం 22,36,842 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 15.52శాతంగా ఉన్నది. కరోనా కేసులు పెరుగుతున్నా గతంలో మాదిరిగా పెద్దగా తీవ్రత కనిపించడంలేదు. పైగా ఇప్పటికే దేశంలో కోట్లాది మంది వ్యాక్సిన్ తీసుకోవడంతో వైరస్ తీవ్రతకు బ్రేకులు పడుతున్నాయి. మరోవైపు ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకుంటుండటంతో కరోనా నుంచి బయటపడటం ఈజీ అయిందని చెప్పుకోవచ్చు. కరోనా మహమ్మారి పట్ల చాలా కాలంగా ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!