మస్కట్లో 500,000 నకిలీ ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ సీజ్
- January 25, 2022
ఒమన్: 500,000 నకిలీ ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ ను మస్కట్ - కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) సీజ్ చేసింది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, రాయల్ ఒమన్ పోలీస్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంయుక్తంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయించే ప్రముఖ సంస్థపై దాడి చేశారు. అక్కడ నిల్వ చేసిన ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ల నకిలీ ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీఏ లోని ఒక అధికారి చెప్పారు. సీజ్ చేసిన వాటిల్లో ఎలక్ట్రికల్ పరికరాలు, వైర్లు, ఎలక్ట్రిక్ బల్బుల వంటివి ఉన్నాయన్నారు. ఈసందర్భంగా నకిలీ ఎలక్ట్రికల్ వస్తువులను తయారు చేస్తున్న స్కిల్డ్ లేబర్ ను అరెస్ట్ చేశారు. దాడులు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అథారిటీ స్పష్టం చేసింది. నకిలీ వస్తువులను అమ్మే వారి వివరాలను తెలియజేయాలని ప్రజలను సీపీఏ కోరింది.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







