ఏపీ కరోనా అప్డేట్
- January 27, 2022అమరావతి: ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమౌతున్నాయి. బుధవారం 13వేల 618 కరోనా కేసులు నమోదయితే…గత 24 గంటల్లో 13 వేల 474 మందికి వైరస్ సోకింది. ఈ మేరకు 2022, జనవరి 27వ తేదీ గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 41 వేల 771 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది. వైరస్ ను కట్టడి చేసేందుకు ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నమోదైన మొత్తం 22,33,152 పాజిటివ్ కేసులకు గాను 21,09,080 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది.
14,579 మంది మరణించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,09,493గా ఉందని తెలిపింది. కరోనా కారణంగా విశాఖపట్టణంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు బులెటిన్ లో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 10,290 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,23,25,140 శాంపిల్స్ పరీక్షించారు.
జిల్లాల వారీగా:
అనంతపురం 980. చిత్తూరు 328. ఈస్ట్ గోదావరి 1066. గుంటూరు 1342. కడప 2031. కృష్ణా 873. కర్నూలు 1835. నెల్లూరు 1007. ప్రకాశం 1259. శ్రీకాకుళం 259. విశాఖపట్టణం 1349. విజయనగరం 469. వెస్ట్ గోదావరి 676 : మొత్తం – 13,474
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం