PGCIL లో ఉద్యోగాలు..
- January 28, 2022
పీజీసీఐఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ ట్రెయినీ (AET) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 105 పోస్టులను భర్తీ చేయనున్నారు.
భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్ ఇంజనీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 105 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుకు సంబంధించి గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 20 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్సైట్ https://www.powergrid.in/చూడొచ్చు.
మొత్తం పొస్టుల సంఖ్య : 105 పోస్టులు: అసిస్టెంట్ ఇంజనీర్ ట్రెయినీ ఖాళీల వివరాలు: కంప్యూటర్ సైన్స్: 37, ఎలక్ట్రికల్: 60, సివిల్: 4, ఎలక్ట్రానిక్స్: 4 ట్రెయినింగ్ పీరియడ్ : ఏడాది పే స్కేల్: ట్రెయినింగ్ పీరియడ్లో నెలకు రూ.40,000 జీతంగా చెల్లిస్తారు. ట్రెయినింగ్ పూర్తయిన తర్వాత రూ.50,000 నుంచి రూ.1,60,000 జీతంగా చెల్లిస్తారు. అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్/సివిల్/ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఫుల్ టైం బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ 2021 కూడా ఉండాలి.
వయోపరిమితి: డిసెంబర్ 31, 2021 నాటికి అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు. ఎంపిక విధానం: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము: ఓబీసీ, ఇతర అభ్యర్ధులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూసీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2022 పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.powergrid.in/
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన







