సేఫ్ గ్యాప్ వదలని 45 వేల వెహికిల్స్ కు ఫైన్
- January 28, 2022
అబుధాబి: వాహనాల వెనుక సేఫ్ గ్యాప్ వదలనందుకు 2021లో అబుధాబిలో 45,269 ఫైన్ లను అబుధాబి పోలీస్ (ADP) ట్రాఫిక్, పెట్రోల్స్ డైరెక్టరేట్ విధించింది. అదే సమయంలో సేఫ్ గ్యాప్ వదలని కారణంగా కలిగే ప్రమాదాల గురించికూడా హెచ్చరించింది. ఇలాంటి చర్యలతో ట్రాఫిక్ ప్రమాదాలు సంభవిస్తాయని, తమను, ఇతరులకు ప్రమాదకరమని పేర్కొంది. డ్రైవర్లు ఎల్లప్పుడూ ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించింది. పొగమంచు, వర్షం కారణంగా ఏర్పడే అసురక్షిత పరిస్థితుల్లో వాహనాల మధ్య వదిలిన సేఫ్ డిస్టెన్స్ తో ప్రమాదాలను నివారించవచ్చని డైరెక్టరేట్ డ్రైవర్లకు సూచించింది. 2020 నాటి చట్టం నంబర్ 5 ప్రకారం రెండు కార్ల వెనుక సేఫ్ గ్యాప్ వదలడం తప్పనిసరి అని గుర్తు చేసింది. సేఫ్ గ్యాప్ వదలకుండా.. ప్రమాదాలకు కారణమైన వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించింది. ఆ వాహనాన్ని సీజ్ చేసిన తేదీ నుండి మూడు నెలలలోపు Dhs5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ జరిమానాను మూడు నెలల్లో చెల్లించకపోతే సదరు వాహనాన్ని బహిరంగ వేలం యార్డుకు తరలిస్తామని వెల్లడించింది.అంతేకాకుండా, 2017 కోసం ట్రాఫిక్ నిబంధనలు 178లోని ఆర్టికల్ 52 ప్రకారం వాహనదారులపై 400 Dhs జరిమానా, నాలుగు ట్రాఫిక్ పాయింట్లు విధించబడుతుందని వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







