సేఫ్ గ్యాప్ వదలని 45 వేల వెహికిల్స్ కు ఫైన్
- January 28, 2022
అబుధాబి: వాహనాల వెనుక సేఫ్ గ్యాప్ వదలనందుకు 2021లో అబుధాబిలో 45,269 ఫైన్ లను అబుధాబి పోలీస్ (ADP) ట్రాఫిక్, పెట్రోల్స్ డైరెక్టరేట్ విధించింది. అదే సమయంలో సేఫ్ గ్యాప్ వదలని కారణంగా కలిగే ప్రమాదాల గురించికూడా హెచ్చరించింది. ఇలాంటి చర్యలతో ట్రాఫిక్ ప్రమాదాలు సంభవిస్తాయని, తమను, ఇతరులకు ప్రమాదకరమని పేర్కొంది. డ్రైవర్లు ఎల్లప్పుడూ ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించింది. పొగమంచు, వర్షం కారణంగా ఏర్పడే అసురక్షిత పరిస్థితుల్లో వాహనాల మధ్య వదిలిన సేఫ్ డిస్టెన్స్ తో ప్రమాదాలను నివారించవచ్చని డైరెక్టరేట్ డ్రైవర్లకు సూచించింది. 2020 నాటి చట్టం నంబర్ 5 ప్రకారం రెండు కార్ల వెనుక సేఫ్ గ్యాప్ వదలడం తప్పనిసరి అని గుర్తు చేసింది. సేఫ్ గ్యాప్ వదలకుండా.. ప్రమాదాలకు కారణమైన వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించింది. ఆ వాహనాన్ని సీజ్ చేసిన తేదీ నుండి మూడు నెలలలోపు Dhs5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ జరిమానాను మూడు నెలల్లో చెల్లించకపోతే సదరు వాహనాన్ని బహిరంగ వేలం యార్డుకు తరలిస్తామని వెల్లడించింది.అంతేకాకుండా, 2017 కోసం ట్రాఫిక్ నిబంధనలు 178లోని ఆర్టికల్ 52 ప్రకారం వాహనదారులపై 400 Dhs జరిమానా, నాలుగు ట్రాఫిక్ పాయింట్లు విధించబడుతుందని వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!