నర్సులు, ప్రవాసుల సమస్యలపై చర్చించిన భారత రాయబారి

- February 04, 2022 , by Maagulf
నర్సులు, ప్రవాసుల సమస్యలపై చర్చించిన భారత రాయబారి

కువైట్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (పిఎఎమ్)తో భారత రాయబారి  సిబి జార్జ్ సమావేశమయ్యారు. కువైట్‌లోని ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఇండియన్ నర్సులకు సంబంధించిన అంశాలు, డొమెస్టిక్ వర్కర్స్ అవగాహన ఒప్పందాన్ని అమలు చేయడం సహా పలు అంశాలపై చర్చించారు. అలాగే  పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడానికి ఇరుపక్షాలు క్రమం తప్పకుండా సమావేశం కావాలని నిర్ణయించారు. భారతదేశం, కువైట్ మధ్య మానవ వనరుల రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపై కూడా వారు చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com