భారత్‌లో కరోనా కేసుల వివరాలు

- February 07, 2022 , by Maagulf
భారత్‌లో కరోనా కేసుల వివరాలు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా 32 రోజుల తర్వాత లక్ష లోపు కేసులు రికార్డయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. గత 24 గంటల్లో కొత్తగా 83 వేల 876 కేసులు నమోదు కాగా.. 895 మరణాలు సంభవించాయని వెల్లడించింది. కేరళలో కొత్తగా 378 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 11, 08, 938 యాక్టివ్ కేసులుండగా 2.62 శాతంగా ఈ కేసులున్నాయని పేర్కొంది. 7.25 శాతానికి చేరుకున్న రోజువారీ పాజిటివిటి రేటు చేరుకోగా దేశంలో ఇప్పటివరకు 4,22,72,014 కేసులు నమోదయ్యాయి. 5,02,874 మరణాలు సంభవించాయి. దేశంలో 96.19 శాతంగా కరోన రికవరీ రేటు ఉంది. ఆదివారం కరోనా నుంచి 1,99,054 మంది కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి 4,06,60,202 మంది కోలుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com