భారత్లో కరోనా కేసుల వివరాలు
- February 07, 2022
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా 32 రోజుల తర్వాత లక్ష లోపు కేసులు రికార్డయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. గత 24 గంటల్లో కొత్తగా 83 వేల 876 కేసులు నమోదు కాగా.. 895 మరణాలు సంభవించాయని వెల్లడించింది. కేరళలో కొత్తగా 378 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 11, 08, 938 యాక్టివ్ కేసులుండగా 2.62 శాతంగా ఈ కేసులున్నాయని పేర్కొంది. 7.25 శాతానికి చేరుకున్న రోజువారీ పాజిటివిటి రేటు చేరుకోగా దేశంలో ఇప్పటివరకు 4,22,72,014 కేసులు నమోదయ్యాయి. 5,02,874 మరణాలు సంభవించాయి. దేశంలో 96.19 శాతంగా కరోన రికవరీ రేటు ఉంది. ఆదివారం కరోనా నుంచి 1,99,054 మంది కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి 4,06,60,202 మంది కోలుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







