ఎక్స్ పో 2020 దుబాయ్.. మరోసారి తగ్గిన టిక్కెట్ ధరలు
- February 09, 2022
యూఏఈ: 'వరల్డ్స్ గ్రేటెస్ట్ షో' ఎక్స్ పో 2020కి ముగియడానికి ఇంకా ఎనిమిది వారాల కంటే తక్కువ సమయం ఉండటంతో టిక్కెట్ ధరలను మరోసారి తగ్గించారు. ఎక్స్ పో 2020 కోసం సింగిల్ ఎంట్రీ వారం పాస్ ధరను Dh45కి తగ్గించారు. 31, 2022 వరకు సింగిల్ ఎంట్రీకి సంబంధించి ఒక రోజు పాస్పై 50 శాతం తగ్గింపు ఇచ్చారు. 18- 59 సంవత్సరాల మధ్య వయస్సు గల సందర్శకులు ఈ పాస్ను పొందవచ్చు. 45 దిర్హామ్ టిక్కెట్ గతంలో సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు దాన్ని వారం వీకెండ్ లకు పొడిగించారు. అలాగే టికెట్ కొన్నావారు 10 స్మార్ట్ క్యూ బుకింగ్లకు అర్హత సాధిస్తారు. Dh195 ధరతో పాస్ తో మార్చి 31, 2022 వరకు అపరిమితంగా ఎక్స్ పో 2020 దుబాయ్ని సందర్శించవచ్చు. ఇంతకుముందు దీని ధర Dh 495. అక్టోబర్ 1, 2021న ప్రారంభమైనప్పటి నుండి ఫిబ్రవరి 1 నాటికి 11 మిలియన్లకు పైగా సందర్శకులు ఎక్స్ పో 2020 దుబాయ్ ని సందర్శించారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









