దుబాయ్ హిందూ దేవాలయంపై కలశాల ఏర్పాటు
- February 09, 2022
దుబాయ్: జెబెల్ అలీలోని హిందూ దేవాలయంపై కలశాల స్థాపన ఫిబ్రవరి 9తో పూర్తవుతుందని ఆలయ అధికారులు చెప్పారు. ఈ మేరకు వారు కొన్ని ఫోటోలను విడుదల చేశారు.ఆలయాలపై కొన్ని కలశాలను ఏర్పాటు చేయడం వాటిల్లో కన్పించింది. కొత్తగా నిర్మితమవుతున్న హిందూ దేవాలయ నిర్మాణ స్థలంలో శనివారం కలశ పూజలు జరిగిన విషయం తెలిసిందే.తాజాగా వాటిని దేవాలయంపై అమర్చారు. ఈ కలశాలను ప్రత్యేకంగా ఇండియా నుండి తెప్పించారు. మొత్తం 9 కలశాల్లో ఎత్తైన కలశం 1.8 మీటర్ల ఎత్తు, 120 కిలోల బరువు ఉంటుంది. మిగిలిన ఎనిమిది ఒక్కొక్కటి 1.2 మీటర్ల ఎత్తు, 90 కిలోల బరువు ఉంటుందని గురుదర్బార్ సింధీ ఆలయ ధర్మకర్తలలో ఒకరైన రాజు ష్రాఫ్ చెప్పారు. ఈ ఆలయాన్ని అధికారిక దసరా 2022కి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. జెబెల్ అలీలోని గురునానక్ దర్బార్ పక్కనే కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతానికి వివిధ మతాల కారిడార్గా గుర్తింపు వస్తదని స్థానికులు భావిస్తున్నారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన హిందూ మత విశ్వాసాలకు అనుగుణంగా కొత్తగా నిర్మించే ఆలయంలో 11 మంది హిందూ దేవతలను ప్రతిష్టించనున్నారు.

_1644383027.jpg )
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









