దుబాయ్ హిందూ దేవాలయంపై కలశాల ఏర్పాటు
- February 09, 2022_1644383045.jpg)
దుబాయ్: జెబెల్ అలీలోని హిందూ దేవాలయంపై కలశాల స్థాపన ఫిబ్రవరి 9తో పూర్తవుతుందని ఆలయ అధికారులు చెప్పారు. ఈ మేరకు వారు కొన్ని ఫోటోలను విడుదల చేశారు.ఆలయాలపై కొన్ని కలశాలను ఏర్పాటు చేయడం వాటిల్లో కన్పించింది. కొత్తగా నిర్మితమవుతున్న హిందూ దేవాలయ నిర్మాణ స్థలంలో శనివారం కలశ పూజలు జరిగిన విషయం తెలిసిందే.తాజాగా వాటిని దేవాలయంపై అమర్చారు. ఈ కలశాలను ప్రత్యేకంగా ఇండియా నుండి తెప్పించారు. మొత్తం 9 కలశాల్లో ఎత్తైన కలశం 1.8 మీటర్ల ఎత్తు, 120 కిలోల బరువు ఉంటుంది. మిగిలిన ఎనిమిది ఒక్కొక్కటి 1.2 మీటర్ల ఎత్తు, 90 కిలోల బరువు ఉంటుందని గురుదర్బార్ సింధీ ఆలయ ధర్మకర్తలలో ఒకరైన రాజు ష్రాఫ్ చెప్పారు. ఈ ఆలయాన్ని అధికారిక దసరా 2022కి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. జెబెల్ అలీలోని గురునానక్ దర్బార్ పక్కనే కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతానికి వివిధ మతాల కారిడార్గా గుర్తింపు వస్తదని స్థానికులు భావిస్తున్నారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన హిందూ మత విశ్వాసాలకు అనుగుణంగా కొత్తగా నిర్మించే ఆలయంలో 11 మంది హిందూ దేవతలను ప్రతిష్టించనున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్