ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు మోదీ పుష్ప నివాళి

- March 30, 2016 , by Maagulf
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు  మోదీ  పుష్ప నివాళి

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పుష్ప నివాళి అర్పించారు. భారత్, యురోపియన్ యూనియన్ మధ్య జరగనున్న శిఖరాగ్ర సదస్సులో పాల్గోనేందుకు మోదీ బ్రస్సెల్స్ వెళ్లారు. మాల్‌బీక్ మెట్రో స్టేషన్ దగ్గర మోదీ పుష్పగుచ్ఛం ఉంచారు. దాడి జరిగిన రోజున అక్కడ సుసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. ఆ పేలుడులో ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్రన్ గణేశన్ మృతిచెందాడు. బ్రస్సెల్స్‌లో వారం రోజుల క్రితం జరిగిన పేలుళ్లలో సుమారు 32 మంది మృతిచెందారు. మాల్‌బీక్ స్టేషన్ దగ్గర జరిగిన పేలుడులోనే 13 మంది ప్రాణాలు కోల్పోయారు. బెల్జియం, యురోపియన్ యూనియన్ నేతలతో మోదీ భేటీ అయ్యారు.
ఎగ్‌మోంట్ ప్యాలెస్‌లో ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com