పోర్టు సామర్థ్యం పెంపునకు రూ. 2200 కోట్లు ఖర్చు ..

- March 30, 2016 , by Maagulf
పోర్టు సామర్థ్యం పెంపునకు రూ. 2200 కోట్లు ఖర్చు ..

పోర్టు ఆధునీకరణ, సామర్థ్యం పెంపునకు రూ. 2200 కోట్లు ఖర్చు చేస్తామని పోర్టు ట్రస్ట్‌ చైర్మన్‌ కృష్ణబాబు తెలిపారు. పోర్టు సామర్థ్యం 90 మిలియన్‌ టన్నుల నుంచి125 మిలియన్‌ టన్నులకు పెరుగుతుందన్నారు. ఆయిల్‌ బంకరింగ్‌పై 26శాతం నుంచి 0.5 శాతానికి పన్ను తగ్గిందని, చమురు వాణిజ్యం పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. సాగరమాల ప్రాజెక్ట్‌లో భాగంగా పోర్టుకు రైలు, రోడ్డు మార్గాలు నిర్మించినున్నట్లు తెలిపారు. భీమిలి దగ్గర రూ. 300 కోట్లతో క్రూయిజ్‌ టెర్మినల్‌కు ప్రతిపాదనలు వచ్చాయని, పోర్టు ప్రాంతంలో రూ. 10 కోట్లతో తాత్కాలిక ఏసీ టెర్మినల్‌కు ప్రతిపాదనలు వచ్చినట్లు కృష్ణబాబు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com