'వ్యాక్సినేషన్ లేని' ఎంట్రీ కువైటీలకే పరిమితం: DGCA సర్క్యులర్
- February 18, 2022
కువైట్: 'వ్యాక్సినేషన్ లేని' ఎంట్రీని కువైట్ పౌరులకు మాత్రమే పరిమితం చేస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సర్క్యులర్ జారీ చేసింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్న అన్ని విమానయాన సంస్థలకు ఈ సర్క్యులర్ ను పంపారు. ఫిబ్రవరి 20 వరకు ప్రయాణికులందరూ స్వేచ్ఛగా కువైట్ వదిలి వెళ్ళడానికి అనుమతించారు. అయితే దేశంలోకి వచ్చేందుకు మాత్రం కరోనా నియంత్రణ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని ప్రయాణీకులు, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేకుండా దేశంలోకి ప్రవేశించే "కువైటీలు" ప్రయాణానికి ముందు 72 గంటల ముందు చేసుకున్న పీసీఆర్ నెగటివ్ సర్టిఫికేట్ సమర్పించాలని సర్క్యులర్ పేర్కొంది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ఈ ప్రక్రియ నుండి మినహాయింపునిచ్చారు. కాగా ఈ సర్క్యులర్లో నాన్ కువైట్ల గురించి ప్రస్తావించలేదు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







