కరోనా అంతంపై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ కీలక వ్యాఖ్యలు!
- February 19, 2022
జెనీవా: కరోనా మహమ్మారి వ్యాప్తికి, ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చేందుకు పరిస్ధితులు అనుకూలంగా ఉన్నా మనం మహమ్మారి అంతానికి సంసిద్ధమైనరోజు అది అంతమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియేసస్ అన్నారు. జర్మనీలో జరుగుతున్న మునిచ్ సెక్యూరిటీ సదస్సు 2022 లైవ్ సెషన్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి నుంచి బయటపడటంపైనే ప్రపంచం దృష్టిసారించాలని ఆయన నొక్కిచెప్పారు.
రెండేండ్ల కిందట మనం కలుసుకున్నప్పుడు వైరస్ గుప్పిట్లోకి జారుతున్నామని, అయితే మహమ్మారి మూడో ఏడాదిలోకి మనం ఇలా అడుగుపెడతామని అప్పట్లో ఏ ఒక్కరూ ఊహించలేదని అన్నారు. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మనమందరం సమాయాత్తమైతే మహమ్మారి ఎంతగా వ్యాప్తి చెందుతూ ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చినా దాన్ని మనం కట్టడి చేసి అంతం చేయవచ్చని అన్నారు. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్లు అధికంగా ఇవ్వడంతో పాటు ఒమిక్రాన్ తీవ్రత తక్కువగ ఉండటంతో మహమ్మారి ముగిసిందనే ప్రచారం సాగిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







