కరోనా అంతంపై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ కీలక వ్యాఖ్యలు!
- February 19, 2022
జెనీవా: కరోనా మహమ్మారి వ్యాప్తికి, ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చేందుకు పరిస్ధితులు అనుకూలంగా ఉన్నా మనం మహమ్మారి అంతానికి సంసిద్ధమైనరోజు అది అంతమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియేసస్ అన్నారు. జర్మనీలో జరుగుతున్న మునిచ్ సెక్యూరిటీ సదస్సు 2022 లైవ్ సెషన్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి నుంచి బయటపడటంపైనే ప్రపంచం దృష్టిసారించాలని ఆయన నొక్కిచెప్పారు.
రెండేండ్ల కిందట మనం కలుసుకున్నప్పుడు వైరస్ గుప్పిట్లోకి జారుతున్నామని, అయితే మహమ్మారి మూడో ఏడాదిలోకి మనం ఇలా అడుగుపెడతామని అప్పట్లో ఏ ఒక్కరూ ఊహించలేదని అన్నారు. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మనమందరం సమాయాత్తమైతే మహమ్మారి ఎంతగా వ్యాప్తి చెందుతూ ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చినా దాన్ని మనం కట్టడి చేసి అంతం చేయవచ్చని అన్నారు. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్లు అధికంగా ఇవ్వడంతో పాటు ఒమిక్రాన్ తీవ్రత తక్కువగ ఉండటంతో మహమ్మారి ముగిసిందనే ప్రచారం సాగిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









