ఏపీ కరోనా అప్డేట్

- February 22, 2022 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24గంట్లలో కొత్తగా 244 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ తో మరణించారు. చిత్తూరు, కృష్ణా జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 662 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 24గంటల వ్యవధిలో 18వేల 803 కరోనా టెస్టులు చేశారు.

నేటివరకు రాష్ట్రంలో 3,30,10,692 కోవిడ్ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,16,711. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,96,430. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ తో చనిపోయిన వారి సంఖ్య 14వేల 716కి పెరిగింది. ప్రస్తుతం 5వేల 565 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తాజాగా 13 వేలకు తగ్గాయి. పాజిటివిటీ రేటు 1.24 శాతానికి క్షీణించింది. మృతుల సంఖ్య కూడా అదుపులోనే ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com