భారత్‌ కరోనా అప్డేట్

- March 01, 2022 , by Maagulf
భారత్‌ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో ఒకే రోజు 6,915 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 4,29,31,045కి చేరుకుంది. అయితే యాక్టివ్ కేసులు 60 రోజుల తర్వాత లక్ష కంటే తక్కువకు పడిపోయాయి. 24 గంటల్లో 180 కొత్త మరణాలు నమోదవడంతో మరణాల సంఖ్య 5,14,023కి చేరుకుంది. దేశంలో యాక్టివ్‌ కేసులు 92,472కి తగ్గాయి.

ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.22 శాతం ఉన్నాయి. అయితే దేశంలో రికవరీ రేటు మరింత మెరుగుపడి 98.59 శాతానికి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. రోజువారీ పాజిటివిటీ రేటు 0.77 శాతంగా నమోదైంది. అయితే వారపు పాజిటివిటీ రేటు 1.11 శాతంగా నమోదైంది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,23,24,550కి చేరుకోగా, మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com