ఈ నెల 16న భగత్ సింగ్ స్వగ్రామంలో ప్రమాణ స్వీకారం
- March 12, 2022
పంజాబ్: పంజాబ్ లో అధికారం ఏర్పాటుకు సంపూర్ణ మెజారిటీని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సాధించిన విషయం తెలిసిందే.ఈనేపథ్యంలోనే ఆప్ తరఫున సీఎం అభ్యర్థిగా ఎంపికైన భగవంత్ మాన్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ను కలిశారు. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.
‘‘నేను గవర్నర్ ను కలిశాను.మా పార్టీ ఎమ్మెల్యేలు మద్దతిస్తున్న లేఖను సమర్పించి ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తీకరించాను. ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయాలని అనుకుంటున్నారంటూ గవర్నర్ ప్రశ్నించారు. భగత్ సింగ్ స్వగ్రామం ఖట్కర్ కలాన్ లో ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాను’’ అని భగవంత్ మాన్ వెల్లడించారు. మంచి కేబినెట్ ను ఏర్పాటు చేసి, చారిత్రక నిర్ణయాలు తీసుకుంటామని మాన్ ప్రకటించారు. పంజాబ్ వ్యాప్తంగా ప్రజలు వచ్చి భగత్ సింగ్ కు నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. గతంలో ఎవరూ తీసుకోని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నామని.. వేచి చూడండని భగవంత్ మాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







