చార్మినార్ ను మరింత సుందరంగా : కేటీఆర్

- April 01, 2016 , by Maagulf
చార్మినార్ ను మరింత సుందరంగా  : కేటీఆర్

హైదరాబాద్ నగరానికి గర్వకారణమైన చార్మినార్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఇవాళ పాతబస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో 35 కోట్లతో చేపట్టిన పాదచారుల ప్రాజెక్టు వివరాలను కేటీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చార్మినార్ పరిసర ప్రాంతాలను కేటీఆర్ తోపాటు మేయర్, డిప్యూటీ మేయర్, జీహెచ్ ఎంసీ కమిషనర్ పరిశీలించారు. అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే పాషాఖాద్రీకి ఇచ్చిన మాట ప్రకారం. చార్మినార్ ను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఆరునెలల్లో పెడస్ట్రియన్ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com