బస్సుల్లో డ్రైవర్ పై అరిస్తే 500 దిర్హామ్ల ఫైన్
- March 17, 2022
యూఏఈ: పబ్లిక్ బస్సులో అందరూ నాగరిక ప్రవర్తన కలిగి ఉండాలని అబుదాబిలోని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు కోరారు. బుధవారం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ పోర్ట్ సెంటర్ (ITC) పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగదారులు తరచుగా చేసే ఉల్లంఘనలు, ఫైన్లను తెలిపే వీడియోను తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేసింది. బస్సులలో చోటుచేసుకునే ఉల్లంఘనలకు Dh100 నుండి Dh500 వరకు ఫైన్లు విధించనున్నట్లు తెలిపింది. తోటి ప్రయాణీకులను అగౌరపరిస్తే Dh500 జరిమానా, డ్రైవర్పై అరవడం లేదా అతని దృష్టి మరల్చడం లాంటి చర్యలకు పాల్పడితే Dh500 ఫైన్ విధిస్తారు. తమ రవాణా కార్డులను ఇతరులకు విక్రయిస్తే Dh500 జరిమానా, బస్సులో తినడం, తాగడం, ధూమపానాలకు పాల్పడితే 200 దిర్హామ్ల జరిమానా విధించబడుతుంది. బస్సు టికెట్ తీసుకోని వారికి 200 దిర్హామ్లు జరిమానా విధించనున్నట్లు ITC పేర్కొంది.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!