బస్సుల్లో డ్రైవర్ పై అరిస్తే 500 దిర్హామ్ల ఫైన్
- March 17, 2022
యూఏఈ: పబ్లిక్ బస్సులో అందరూ నాగరిక ప్రవర్తన కలిగి ఉండాలని అబుదాబిలోని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు కోరారు. బుధవారం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ పోర్ట్ సెంటర్ (ITC) పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగదారులు తరచుగా చేసే ఉల్లంఘనలు, ఫైన్లను తెలిపే వీడియోను తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేసింది. బస్సులలో చోటుచేసుకునే ఉల్లంఘనలకు Dh100 నుండి Dh500 వరకు ఫైన్లు విధించనున్నట్లు తెలిపింది. తోటి ప్రయాణీకులను అగౌరపరిస్తే Dh500 జరిమానా, డ్రైవర్పై అరవడం లేదా అతని దృష్టి మరల్చడం లాంటి చర్యలకు పాల్పడితే Dh500 ఫైన్ విధిస్తారు. తమ రవాణా కార్డులను ఇతరులకు విక్రయిస్తే Dh500 జరిమానా, బస్సులో తినడం, తాగడం, ధూమపానాలకు పాల్పడితే 200 దిర్హామ్ల జరిమానా విధించబడుతుంది. బస్సు టికెట్ తీసుకోని వారికి 200 దిర్హామ్లు జరిమానా విధించనున్నట్లు ITC పేర్కొంది.
తాజా వార్తలు
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!







