బస్సుల్లో డ్రైవర్ పై అరిస్తే 500 దిర్హామ్ల ఫైన్
- March 17, 2022
యూఏఈ: పబ్లిక్ బస్సులో అందరూ నాగరిక ప్రవర్తన కలిగి ఉండాలని అబుదాబిలోని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు కోరారు. బుధవారం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ పోర్ట్ సెంటర్ (ITC) పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగదారులు తరచుగా చేసే ఉల్లంఘనలు, ఫైన్లను తెలిపే వీడియోను తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేసింది. బస్సులలో చోటుచేసుకునే ఉల్లంఘనలకు Dh100 నుండి Dh500 వరకు ఫైన్లు విధించనున్నట్లు తెలిపింది. తోటి ప్రయాణీకులను అగౌరపరిస్తే Dh500 జరిమానా, డ్రైవర్పై అరవడం లేదా అతని దృష్టి మరల్చడం లాంటి చర్యలకు పాల్పడితే Dh500 ఫైన్ విధిస్తారు. తమ రవాణా కార్డులను ఇతరులకు విక్రయిస్తే Dh500 జరిమానా, బస్సులో తినడం, తాగడం, ధూమపానాలకు పాల్పడితే 200 దిర్హామ్ల జరిమానా విధించబడుతుంది. బస్సు టికెట్ తీసుకోని వారికి 200 దిర్హామ్లు జరిమానా విధించనున్నట్లు ITC పేర్కొంది.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..







