ఫోన్ స్కామ్.. Dh140,000 కోల్పోయిన రెసిడెండ్
- March 26, 2022
యూఏఈ: ఫోన్ స్కామ్కు గురైన ఒక ప్రవాసుడు 140,000 దిర్హామ్లను కోల్పోయాడు. కానీ ఒక నెలలోనే ఆ మొత్తాన్ని అబుదాబి పోలీసులు రికవరీ చేశారు. ఫోన్ స్కామ్ల గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సంఘటనను బాధితుడు వివరించిన వీడియోను తాజాగా షేర్ చేశారు. మోసగాళ్లు మొదట తన ఎమిరేట్స్ ఐడీని కోరుతూ ఇమెయిల్ పంపారని ఆ వ్యక్తి చెప్పాడు. అప్పుడు, పోలీసు అధికారులుగా నటిస్తూ.. వారు అతనికి ఫోన్ చేసి, అతని వివరాలను ధృవీకరించమని అడిగారు. తాను వారికి తన వివరాలన్నింటినీ అందించాను. తరువాత, నా బ్యాంక్ ఖాతా నుండి Dh 140,000 కంటే ఎక్కువ మొత్తం తన అకౌంట్ నుంచి డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చిందని వీడియోలో బాధితుడు వివరించాడు. తాను మోసపోయానని గ్రహించిన వెంటనే.. తన బ్యాంక్ ఖాతాను మూసివేయడానికి, కార్డులను బ్లాక్ చేయడానికి తన బ్యాంక్కు కాల్ చేసానని చెప్పాడు. అనంతరం పోలీసు డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేశానన్నారు. దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని పోలీసులు చెప్పారని ఆ వ్యక్తి చెప్పాడు. నెల రోజుల్లోపే తనకు పోలీసు శాఖ నుంచి ఫోన్ వచ్చిందని బాధితుడు చెప్పాడు. డెబిట్ అయిన మొత్తం రికవరీ అయిందని, రెండు మూడు రోజుల్లో తన ఖాతాలో చేరుతుందని పోలీసు అధికారి తెలిపారని బాధితుడు వివరించాడు. తనకు న్యాయం చేసిన అబుదాబి పోలీసులకు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు
- యూకేలో సిక్కు బస్ డ్రైవర్ పై దాడి..గడ్డం పట్టుకుని లాగి..దారుణం..
- ఏషియన్ గేమ్స్లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం
- ఒమన్లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన డాల్ఫిన్ల సందడి..!!
- నిర్మాణ రంగంపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సిఫార్సులు..!!
- యుద్ధం ఆపాలంటే అమెరికాకు 7 షరతులు పెట్టిన ఇరాన్
- బహ్రెయిన్లో ‘వికసిత్ భారత్ రన్’..!!
- కువైట్లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!







