ఫోన్ స్కామ్.. Dh140,000 కోల్పోయిన రెసిడెండ్
- March 26, 2022
యూఏఈ: ఫోన్ స్కామ్కు గురైన ఒక ప్రవాసుడు 140,000 దిర్హామ్లను కోల్పోయాడు. కానీ ఒక నెలలోనే ఆ మొత్తాన్ని అబుదాబి పోలీసులు రికవరీ చేశారు. ఫోన్ స్కామ్ల గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సంఘటనను బాధితుడు వివరించిన వీడియోను తాజాగా షేర్ చేశారు. మోసగాళ్లు మొదట తన ఎమిరేట్స్ ఐడీని కోరుతూ ఇమెయిల్ పంపారని ఆ వ్యక్తి చెప్పాడు. అప్పుడు, పోలీసు అధికారులుగా నటిస్తూ.. వారు అతనికి ఫోన్ చేసి, అతని వివరాలను ధృవీకరించమని అడిగారు. తాను వారికి తన వివరాలన్నింటినీ అందించాను. తరువాత, నా బ్యాంక్ ఖాతా నుండి Dh 140,000 కంటే ఎక్కువ మొత్తం తన అకౌంట్ నుంచి డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చిందని వీడియోలో బాధితుడు వివరించాడు. తాను మోసపోయానని గ్రహించిన వెంటనే.. తన బ్యాంక్ ఖాతాను మూసివేయడానికి, కార్డులను బ్లాక్ చేయడానికి తన బ్యాంక్కు కాల్ చేసానని చెప్పాడు. అనంతరం పోలీసు డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేశానన్నారు. దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని పోలీసులు చెప్పారని ఆ వ్యక్తి చెప్పాడు. నెల రోజుల్లోపే తనకు పోలీసు శాఖ నుంచి ఫోన్ వచ్చిందని బాధితుడు చెప్పాడు. డెబిట్ అయిన మొత్తం రికవరీ అయిందని, రెండు మూడు రోజుల్లో తన ఖాతాలో చేరుతుందని పోలీసు అధికారి తెలిపారని బాధితుడు వివరించాడు. తనకు న్యాయం చేసిన అబుదాబి పోలీసులకు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







