కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం
- March 28, 2022
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మాణంలో వున్న టెర్మినల్ 2 ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆరు ఫైర్ ఫైటింగ్ బృందాలు మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనలో ఎవరికైనా ఎలాంటి ప్రమాదమైనా సంభవించిందా.. అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది. అయితే, ఈ ప్రమాదం కారణంగా విమానాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదని కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ేవియేషన్ పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం వున్న భవనానికి బదులుగా 4.3 మిలియన్ డాలర్లతో టెర్మినల్ 2 నిర్మాణం జరుగుతోంది. 25 మిలియన్ మంది ప్రయాణీకుల్ని ఏడాది కాలంలో ఈ టెర్మినల్ అకామడేట్ చేయగలుగుతుంది. 15,000 కొత్త ఉద్యోగాలు కువైటీలకు రానున్నాయి ఈ భవనం అందుబాటులోకి వస్తే. ఈ ఏడాది ఆగస్టు నాటికి దీన్ని పూర్తి చేస్తారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు