పవిత్ర రమదాన్ మాసం ముందు 659 మందికి క్షమాభిక్ష
- March 28, 2022
దుబాయ్: పవిత్ర రమదాన్ మాసం ముందు యూఏఈ ప్రధానమంత్రి మరియు ఉపాధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్,దుబాయ్ లోని వివిధ కారాగారాలలో, సంస్కరణ కేంద్రాలలో జైలు శిక్షను అనుభవిస్తున్న 659 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు.
షేక్ మొహమ్మద్, బందీల కుటుంబాలలో ఆనందం నింపడానికి ఇచ్చిన ఆజ్ఞలను వెంటనే అమలుచేయడానికి అవసరమైన బహిరంగ న్యాయవిచారణ ప్రక్రియ, పోలీసు శాఖ వారి సహకరంతో వెంటనే ప్రారంభించబడినదని,దుబాయ్ అటర్నీ జనరల్ అల్ హుమైదాన్ తెలిపారు.షేక్ మొహమ్మద్ దయాధర్మ దృష్టికి కృతజ్ఞతలు తెలియచేశారు.అంతేకాకుండా, విడుదలైన ఖైదీలు, తమ మిగిలిన జీవితాన్ని, మతపరమైన, నైతిక పరమైన నియమాలకు ఒడంబాడి జీవించాలని పిలుపునిచ్చారు.
దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, దుబాయ్ పోలీసుల సహకారంతో షేక్ మహ్మద్ ఆదేశాలను అమలు చేయడానికి చట్టపరమైన ప్రక్రియలను ప్రారంభించినట్లు అల్-హుమైదాన్ తెలిపారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









