పవిత్ర రమదాన్ మాసం ముందు 659 మందికి క్షమాభిక్ష
- March 28, 2022
దుబాయ్: పవిత్ర రమదాన్ మాసం ముందు యూఏఈ ప్రధానమంత్రి మరియు ఉపాధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్,దుబాయ్ లోని వివిధ కారాగారాలలో, సంస్కరణ కేంద్రాలలో జైలు శిక్షను అనుభవిస్తున్న 659 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు.
షేక్ మొహమ్మద్, బందీల కుటుంబాలలో ఆనందం నింపడానికి ఇచ్చిన ఆజ్ఞలను వెంటనే అమలుచేయడానికి అవసరమైన బహిరంగ న్యాయవిచారణ ప్రక్రియ, పోలీసు శాఖ వారి సహకరంతో వెంటనే ప్రారంభించబడినదని,దుబాయ్ అటర్నీ జనరల్ అల్ హుమైదాన్ తెలిపారు.షేక్ మొహమ్మద్ దయాధర్మ దృష్టికి కృతజ్ఞతలు తెలియచేశారు.అంతేకాకుండా, విడుదలైన ఖైదీలు, తమ మిగిలిన జీవితాన్ని, మతపరమైన, నైతిక పరమైన నియమాలకు ఒడంబాడి జీవించాలని పిలుపునిచ్చారు.
దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, దుబాయ్ పోలీసుల సహకారంతో షేక్ మహ్మద్ ఆదేశాలను అమలు చేయడానికి చట్టపరమైన ప్రక్రియలను ప్రారంభించినట్లు అల్-హుమైదాన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







