పవిత్ర రమదాన్ మాసం ముందు 659 మందికి క్షమాభిక్ష

- March 28, 2022 , by Maagulf
పవిత్ర రమదాన్ మాసం ముందు 659 మందికి క్షమాభిక్ష

దుబాయ్: పవిత్ర రమదాన్ మాసం ముందు యూఏఈ ప్రధానమంత్రి మరియు ఉపాధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్,దుబాయ్ లోని వివిధ కారాగారాలలో, సంస్కరణ కేంద్రాలలో జైలు శిక్షను అనుభవిస్తున్న 659 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు.

షేక్ మొహమ్మద్, బందీల కుటుంబాలలో ఆనందం నింపడానికి ఇచ్చిన ఆజ్ఞలను వెంటనే అమలుచేయడానికి అవసరమైన బహిరంగ న్యాయవిచారణ ప్రక్రియ, పోలీసు శాఖ వారి సహకరంతో వెంటనే ప్రారంభించబడినదని,దుబాయ్ అటర్నీ జనరల్ అల్ హుమైదాన్ తెలిపారు.షేక్ మొహమ్మద్  దయాధర్మ దృష్టికి కృతజ్ఞతలు తెలియచేశారు.అంతేకాకుండా, విడుదలైన ఖైదీలు, తమ మిగిలిన జీవితాన్ని, మతపరమైన, నైతిక పరమైన నియమాలకు ఒడంబాడి జీవించాలని పిలుపునిచ్చారు.

దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, దుబాయ్ పోలీసుల సహకారంతో  షేక్ మహ్మద్ ఆదేశాలను అమలు చేయడానికి చట్టపరమైన ప్రక్రియలను ప్రారంభించినట్లు అల్-హుమైదాన్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com