రన్ వేపై రెండు ముక్కలైన కార్గో విమానం
- April 08, 2022
శాన్ జోస్ : ఓ కార్గో విమానం రన్ వేపై రెండు ముక్కలైంది. జర్మన్ కు చెందిన డీచ్ఎల్ బోయింగ్ 757 కార్గో విమానం కోస్టారికాలోని సాన్ జోస్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కోసం ఎయిర్పోర్ట్ అనుమతి కోరగా, అందుకు అనుమతి వచ్చింది. ఎయిర్పోర్టుకు తిరిగి వచ్చిన ఆ కార్గో విమానం రన్వేపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత రెండు ముక్కలైంది.
అందులోంచి పైలట్లు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తిందని, అందుకే ఈ ఘటన చోటు చేసుకుందని ఎయిర్పోర్ట్ అధికారులు వివరించారు. ల్యాండింగ్ సమయంలో విమాన ప్రమాదం జరిగే అవకాశాలు ఉండడంతో ముందస్తు చర్యలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఇండోనేసియాలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు
- ఈనెల 19 నుంచి హార్ముజ్ పూర్తిగా ఓపెన్–ట్రంప్
- 3D మెరైన్ సర్వే ప్రాజెక్ట్ కోసం కొత్త వర్క ఏరియా:కోస్ట్ గార్డ్
- యూఏఈలో మొహర్రం ఆరంభం..!!
- కువైట్ T4 టెర్మినల్ ద్వారా ఆపరేషన్స్ పునఃప్రారంభం..!!
- MENAలో అత్యంత శాంతియుత దేశంగా ఖతార్..!!
- బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!









