94 మంది యాచకులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు
- April 21, 2022
యూఏఈ: పవిత్ర రమదాన్ మాసంలో ‘భిక్షాటన చేయడం నేరం’ అనే ప్రచారాన్ని షార్జా పోలీసులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పవరకు 94 మంది యాచకులను షార్జా పోలీసులు అరెస్టు చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ ప్రచారాన్ని ప్రారంభించామని, చట్టం ప్రకారం భిక్షాటన శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుందని షార్జాలోని బెగ్గర్ కంట్రోల్ టీమ్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ జాసిమ్ మొహమ్మద్ బిన్ తలియా తెలిపారు. ఈ చట్టవిరుద్ధమైన పద్ధతులను అరికట్టడానికి షార్జా పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. చాలా మంది బిచ్చగాళ్ళు వాణిజ్య, నివాస ప్రాంతాలు, మస్జీదుల సమీపం నుంచి అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో 65 మంది పురుషులు, 29 మంది మహిళలతో సహా 94 మంది యాచకులను అరెస్టు చేశామన్నారు. 80040, 901 ద్వారా యాచకుల సమాచారాన్ని తనిఖీ బృందాలకు తెలపాలని బిన్ తలియా తెలిపారు. అరెస్టయిన యాచకుల్లో ఎక్కువ మంది విజిట్ వీసాపై యూఏఈ వచ్చారని, మరికొందరు స్థానికులని, డబ్బు సంపాదించడానికి పవిత్ర మాసాన్ని ఎంచుకున్నారని, పట్టుబడిన వెంటనే బిచ్చగాళ్లపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నారని ఆయన వివరించారు. అరెస్టయిన బిచ్చగాళ్ల వద్ద రెమిటెన్స్ రసీదులు దొరికాయని, ఒకతను 44,000 Dhs, మరొకతను Dhs 12,000, ఇంకోవ్యక్తి Dhs 9,000 కలిగి ఉన్నారని బిన్ తలియా తెలిపారు. ఈ ప్రచారం కొనసాగుతుందని, 2020, 2021లో 1,409 మంది యాచకులను అరెస్టు చేశామని, వారి వద్ద నుంచి 500,000 దిర్హాలు స్వాధీనం చేసుకున్నామని బిన్ తలియా చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







