ఆలయ రథోత్సవంలో విషాదం.. 11 మంది మృతి

- April 27, 2022 , by Maagulf
ఆలయ రథోత్సవంలో విషాదం.. 11 మంది మృతి

తమిళనాడు: బుధవారం తెల్లవారుజామున సమీపంలోని కలిమేడు వద్ద అప్పర్ ఆలయ రథోత్సవం జరుగుతుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తమిళనాడు తంజావూరు జిల్లాలో ఆలయ రథోత్సవం సందర్భంగా హైటెన్షన్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ తాకడంతో ఇద్దరు చిన్నారులు సహా 11 మంది విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా, పలువురు గాయపడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. బుధవారం తెల్లవారుజామున సమీపంలోని కలిమేడు వద్ద అప్పర్ ఆలయ రథోత్సవం జరుగుతుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను తంజావూరు వైద్య కళాశాలలో చేర్పించారు. తమిళనాడులో జరిగే వార్షిక రథోత్సవంలో భాగంగా ఈ ఊరేగింపు జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com